ఈనెల 11న ఉత్తరప్రదేశ్లో ఇద్దరు టెర్రరిస్టులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా టెర్రరిస్టులను ప్రశ్నించడానికి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీంకు సంబంధించిన ముగ్గురు అధికారులు లక్నోకు చేరుకున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులకు అల్-ఖైదాకు చెందిన అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్తో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారిలో అహ్మద్ అనే వ్యక్తి లక్నోలో నివసిస్తుండగా, మసీరుద్దీన్ ఉత్తర ప్రదేశ్ రాజధాని మాడియాన్ ప్రాంతంలో నివసించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఇళ్ల నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ విలేకరులతో అన్నారు.
లక్నోతో సహా రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) ముందు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించాలని వారు సన్నాహాలు చేసుకున్నారని కుమార్ చెప్పారు. ఈ ఉగ్రవాదులు లక్నో నుండి మాత్రమే కాదు, కాన్పూర్ నుండి కూడా వచ్చారని చెబుతున్నాడు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏటిఎస్ బృందంఅహ్మద్, మసీరుద్దీన్లను అరెస్టు చేసింది. కానీ వారితో ఉన్న మరో ఇద్దరు తప్పించుకోవడంతో వారిని పట్టుకోవడానికి ఎటిఎస్ వివిధ ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోంది.