తిరుమలలో భక్తుల ఆందోళన!

Chaganti
తిరుమల తిరుపతిలో ఏంబీసీ 34 విచారణ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖల విషయంలో అదనపు ఈవో కార్యాలయంలో ఈ దర్శనాలను తిరస్కరించడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఇక తిరుమలలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టిక్కెట్లు జారీ చేయాలంటూ పెద్ద సంఖ్యలో ఎంబీసీ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. 


ఇక ఎంబీసీ కార్యాలయం వద్దకు చేరుకుని భక్తులకు పోలీస్, విజిలెన్స్ సిబ్బంది సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమకు దర్శన టికెట్లు ఎందుకు కేటాయించలేదని భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు భక్తులు. అదనపు ఈవో కార్యాలయంలో తాము తీసుకొచ్చిన సిఫార్సు లేఖలను స్వీకరించి ఇప్పుడు దర్శనం తిరస్కరిస్తే మేము ఏమి చేయాలని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఇక కరోనా కారణంగా చాలా తక్కువ సంఖ్యలో దర్శనానికి అనుమతి ఇస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: