వైసీపీ ఎమ్మెల్యేతో ప్రాణాహాని ఉందంటున్న బీజేపీ నేత‌...?

N.V.Prasd
స‌త్తెన‌ప‌ల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుతో త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని బీజేపీ నేత కోటేశ్వ‌ర‌రావు ఆరోపించారు. సత్తెన‌పల్లి మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడుగా ఉన్న కోటేశ్వ‌ర‌రావు అదే ప‌ట్ట‌ణంలో వైసీపీ నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తికి చెందిన రెండున్న‌ర ఎక‌రాల పొలాన్ని ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు.అయితే వైసీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌వేశ పెట్టిన జ‌ల‌క‌ళ ప‌థ‌కం ద్వారా త‌న పొలంలో బోరు వేయించాల‌ని ల‌క్ష్మీపార్వ‌తి కోటేశ్వ‌ర‌రావుకి సూచించారు. దీనికోసం ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుని క‌ల‌వాల‌ని ఆమె సూచించారు.అయితే ఆమె పొలంలో బోరు వేయించేందుకు కోటేశ్వ‌ర‌రావు ప్ర‌య‌త్నించ‌గా స్థానిక నేత‌లు ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని  ఆయ‌న ఆరోపించారు.స్థానిక నేతల వ్యవహార శైలీ పై అంబటి రాంబాబుకి బిజేపి నేత కోటేశ్వ‌ర‌రావు ఫోన్ చేయ‌గా ఆమె పొలం గురిచి త‌న‌కు ఫోన్ చేయ‌వ‌ద్దంటూ అంబ‌టి రాంబాబు కోటేశ్వ‌ర‌రావుకి తెల్చి చెప్పారు.అయితే దీనిపై గవర్నర్ ,  సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానన్న బిజేపి నేత అన‌డంతో దానిని హేళ‌న చేస్తూ ప్ర‌ధానికి,రాష్ట్రప‌తికి కూడా ఫిర్యాదు చేసుకో అంటూ అంబ‌టి రాంబాబు స‌మాధాన‌మిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: