మరి అలా అయితే జగన్ ను ఉరి తీయాలా...?
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు లోకేష్. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్చని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి అని లోకేష్ డిమాండ్ చేసారు. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది అని ఆయన ఆరోపణలు చేసారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది అని స్పష్టం చేసారు.