సీమలో అలజడి రేపుతున్న నాటు బాంబులు...?
నాటు బాంబుల పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయితీ మహేశ్వరం ఎస్ టి కాలనీ కి చెందిన దొరస్వామి(37)ని అరెస్టు చేసారు. మరో ఇద్దరు పరార్ అయ్యారని వారి కోసం గాలిస్తున్నారని తెలిసింది. తిరుపతి -కొత్తపల్లిమిట్ట రోడ్డు గొడుగు చింత వద్ద 20 నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.