హుజురాబాద్ ఉప ఎన్నిక : గెలిచేది ఎవరో తేల్చిన సర్వే

Mamatha Reddy
హైదరాబాద్ ఉప ఎన్నిక పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ పాద యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈటల రాజేందర్ గెలవడం ఖాయం అంటూ ఉద్ఘాటించారు. ప్రభుత్వం చేయించిన సర్వేలో 71 శాతం ప్రజలు ఈటల రాజేందర్ కి అనుకూలంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం ఓటమి పాలవ్వక తప్పదని హెచ్చరించారు. ఈ ఉపఎన్నిక ఉద్యమకారుల మరియు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఉప ఎన్నిక అంటూ వ్యాఖ్యానించారు అభినవ అంబేద్కర్ గా చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన జయంతి వేడుకలకు సైతం కనీసం హాజరుకాలేదు అంటూ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కు సంబంధించి గతంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఆ హామీలను తుంగలో తొక్కారని పేర్కొన్నారు, కేసీఆర్ దళిత ద్రోహి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: