28 మంది ఎంపీల వల్ల ఏం లాభమన్న దేవినేని

Podili Ravindranath
పోలవరం ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ సర్కార్ పై దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో ఎంతమంది నిర్వాసితులకు పరిహారం చెల్లించారని ప్రశ్నించారు. అలాగే ఎంతమందికి పునరావాసం కల్పించారో వివరాలు బయటపెట్టాలన్నారు, 2019లోనే పోలవరం ప్రాజెక్టు కోసం నారా చంద్రబాబునాయుడు 55 వేల 548 కోట్ల రూపాయలకు టీఏసీలో ఆమోదం తెచ్చిన విషయాన్ని దేవినేని ఉమా గుర్తు చేశారు. ప్రస్తుతం వైసీపీకి 28 మంది ఎంపీలుండీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం అని రాజ్యసభలో వైసీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు కంటే ముందే నిర్వాసితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తానంటూ పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై చేసిన అబద్ధపు ప్రచారాన్ని ఇప్పుడు ప్రజల ముందు రుజువు చేయాలని దేవినేని ఉమా సవాల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: