ఆ ఆనవాయితీ పాటిస్తారా?
గత కొంతకాలంగా ఇది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఇరు రాష్ట్రాల మినిస్టర్స్ డ్యామ్ గేట్ల ఓపెనింగ్ కు వెళ్తారా ? లేదా ? అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. తెలంగాణ మినిస్టర్స్ ఈ విషయంపై ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి కొన్ని రోజుల నుంచి ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా తేలలేదు. రేపు ఏం జరగనుందో అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.