భారీ కెమికల్ బ్లాస్ట్..ఇద్దరు మృతి!
ఈ పేలుడు వల్ల సంభవించిన మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఉదయం 9:40 గంటలకు ద్రావకాల నిల్వ ట్యాంకుల్లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని, పిల్లలను బయట ఆడుకోవద్దని, పెరటి నుండి పండ్లు, కూరగాయలు తినవద్దని అక్కడి ప్రజలను హెచ్చరించారు. సమీపంలోని పలు ప్రధాన రహదారులను పోలీసులు చాలా గంటలు మూసివేశారు. ప్రమాదానికి గల కారణం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.