అదరగొట్టిన WTC ఫైనల్ మ్యాచ్ వ్యూయర్షిప్

Mamatha Reddy
WTC Final Match: ఐసీసీ, ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన WTF ఫైనల్ మ్యాచ్ ని ఎంతో మంది అభిమానులు తిలకించారు. ఈ రెండు దేశాల మధ్య జరిగే ఈ పోటీని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపించడం విశేషం. ఈ సిరీస్ కు సంబంధించిన తాజా వివరాలను ఐసీసీ విడుదల చేసింది. రెండేళ్ల పాటు జరిగిన చాంపియన్షిప్ లో అన్నింటిలోనూ ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్ గా ఈ WTF సిరీస్ చరిత్రకెక్కింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ ని 177 మిలియన్ల మంది వీక్షించి నట్టుగా తెలుస్తోంది. భారత్ నుంచి సైతం ఈ ఫైనల్ మ్యాచ్ ని ఎక్కువ సంఖ్యలో వీక్షించారు. ఒక్క దూరదర్శన్ ఛానెల్ నుంచి 94 శాతం వ్యూయర్షిప్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: