సీఎం ఫ్రెండ్ రివర్స్ గేర్ ఎందుకు?
ఉద్యోగులపై జగన్ కోపంగా ఉన్నారు..జగన్ పై ఉద్యోగులు కోపంగా ఉన్నారు. ఈ రెండూ నిజమే కనుక ఇప్పుడు కొత్త తగాదా మొదలయింది.వాస్తవానికి ఎన్జీఓ సంఘ కొత్త అధ్యక్షులు బండి శ్రీను సీఎం కు ఎంతో చేరువ ఉన్న వ్యక్తి..సన్నిహిత సంబంధ బాంధవ్యాలు నడిపిన వ్యక్తి..ఆయన కూడా సర్కారును ఇరకాటంలో పెడుతున్నారు. సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని స్వామి వేంకటేశ్వరుడ్ని వేడుకున్నానని చెప్పడం ఈ కథలో ట్విస్టు..అదేవిధంగా కొత్త పీఆర్సీ అమలుకు కృషి చేయాలని కూడా ఏడు కొండలవాడ్ని వేడుకున్నాడని చెప్పారు.. బాగుంది కానీ ఇప్పటికిప్పుడు కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా లేరు. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు బాగుండకపోవడంతో జీతాల చెల్లింపు జాప్యం అవుతున్న మాట వాస్తవమే కనుక తన కుటుంబ సభ్యుల్లాంటి ఉద్యోగులు సానుభూతితో విషయం అర్థం చేసుకోకుండా అనవసరపు విషం మీడియా ఎదుట చిమ్మడం భావ్యం కాదని సీఎం జగన్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్న మాట.