తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్?
గాంధీ ఆస్పత్రిలో కరోనా వార్డు ఫుల్ అయ్యింది. గాంధీ హాస్పిటల్ కు రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారం క్రితం వరకు అక్కడ రోజుకు 20 కేసులు మాత్రమే వచ్చేవి. వైద్య, ఆరోగ్యశాఖ మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అలర్ట్ అవుతోంది. తెలంగాణలో వరుస పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళలో లాక్ డౌన్ ప్రకటించారు. మళ్ళీ మరోసారి దేశం మొత్తం లాక్ డౌన్ పరిస్థితులు ఎదుర్కొంటుందేమో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.