బిగ్ బ్రేకింగ్: ఏపీ సర్కార్ కు ఎన్జీటి షాక్...?

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి టీడీపీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి పలు మార్లు ఫిర్యాదు చేయగా దీనిపై స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధారాలు పరిశీలించిన తరువాత మైనింగ్ పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని నిర్ధారణకు వచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... ఎటువంటి అటవీశాఖ అనుమతులు లేకుండానే మైనింగ్ కోసం వేలాది వృక్షాలని ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం చెయ్యడాన్ని తప్పుబట్టింది.

అనుమతించిన పరిధి దాటి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్టు గుర్తించింది. తక్షణమే గనుల శాఖ ఆధ్వర్యంలో శాఖ పరమైన విచారణ చేపట్టి అక్రమాలకు అండగా నిలిచిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం సంచలనం అయింది. జరిగిన నష్టానికి బాధ్యులైన అధికారుల నుండి నష్ట పరిహారం వసూలు చెయ్యాలని  కూడా ఆదేశాలు ఇచ్చింది. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాల పై విచారణ చేపట్టేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేస్తూఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ngt

సంబంధిత వార్తలు: