కాశ్మీర్ లో కలకలం.. ఇద్దరు టెర్రరిస్టులు మృతి!
అయితే ఫారెస్ట్ ఏరియా లో మరికొంత మంది ఉగ్రవాదులు నక్కి ఉంటారనే ఉద్దేశంతో కాశ్మీర్ జోన్ పోలీసులు ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో వీరి మీదకు ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు