జగన్ ను తిడితే అంతం చేస్తా... రఘురామకు ఎంపీ వార్నింగ్...?
పార్లమెంటు ఆవరణలో తనను ఎంపీ గోరంట్ల మాధవ్ దుర్భాషలాడారు అని రఘురామ రాజు ఫిర్యాదు చేసారు. సిఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు ఆపకపోతే మాత్రం కచ్చితంగా అంతం చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని రఘురామ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా కు ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేసారు. తనను బెదిరించిన ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.