దేవుడు స్క్రిప్ట్ భలే రాసాడుగా జగన్ !
నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక సదస్సులు పెట్టారని, తద్వారా ప్రసిద్ధ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చి యువతకు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు పై విష ప్రచారం చేసిన జగన్, నేడు అధికారంలోకి వచ్చి తన కక్ష సాధింపు వైఖరితో కంపెనీలు రాష్ట్రాలు వదిలి వెళ్లిపోయేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాడు నీవు చెప్పిన మాటలు నీకే వర్తిస్తున్నాయి జగన్ రెడ్డి అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దేవుడు స్క్రిప్ట్ భలే రాసాడుగా అంటూ ఆ ట్వీట్ ను ఎండ్ చేశారు.