ఈరోజు 'పాగ‌ల్' వ‌స్తున్నాడు..

Garikapati Rajesh

విశ్వ‌క్‌సేన క‌థానాయ‌కుడిగా, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌గా న‌టించిన చిత్రం పాగ‌ల్‌. ఈ చిత్రాన్ని ధియేట‌ర్ల‌లో ఈరోజు విడుద‌ల చేస్తున్నారు. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్కీ మీడియా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై బెక్కెం వేణుగోపాల్‌, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌రోనా రెండోద‌శ త‌ర్వాత నెమ్మ‌దిగా ధియేట‌ర్లు తెరుచుకోవ‌డం, ప‌రిస్థితుల‌న్నీ స‌ద్దుమ‌ణుగుతుండ‌టంతో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని నిర్మాణ బృందం భావించింది. ఈ సంద‌ర్భంగా క‌థానాయ‌కుడు త‌న ఫేస్‌బుక్ ఖాతాద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఒక విజ్ఞ‌ప్తి చేశారు. ఎంతోమందికి ఉపాధి క‌ల్పిస్తోన్న ధియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని చూసి వాటిని ఆదుకోవాల‌ని, సిబ్బందిని కాపాడాల‌ని కోరారు.

నేను మీ విశ్వ‌క్‌సేన్‌..
న‌న్ను ఇంత‌గా స‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఇంత దూరం వ‌చ్చి న‌న్ను, పాగ‌ల్ సినిమాను ఆద‌రిస్తార‌ని, సెకండ్‌వేవ్ త‌ర్వాత మ‌ళ్లీ తెరిచిన సినిమా ధియేట‌ర్ల‌ను నిల‌బెడ‌తార‌ని కోరుకుంటున్నాను. మా ప్ర‌య‌త్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే విమ‌ర్శించండి. కానీ ద‌య‌చేసి దాడిచేయ‌కండి. త‌ట్టుకునే శ‌క్తి ఉన్నా.. లేక‌పోయినా ఎన్నో వేల‌మందికి ఉపాధి క‌ల్పించే సినిమా ధియేట‌ర్ల‌ను కాపాడండి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చిన నాకు మీరే అండ‌, దండ.
ఇట్లు
మీ విశ్వ‌క్‌సేన్‌


మరింత సమాచారం తెలుసుకోండి:

tag

సంబంధిత వార్తలు: