వివాదాస్పద జీవో: ఏపీ హైకోర్ట్ లో విచారణ...?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు హైకోర్ట్ లో సమీక్షకు వెళ్ళడం ఇబ్బందికర అంశం. స్కూల్స్, కాలేజీ ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53, 54 పై హైకోర్టులో విచారణ జరిగింది నేడు. జీవో లకు చట్టబద్దత లేదంటూ హైకోర్టులో వ్యాజ్యం ధాఖలు అయింది. జీవో 53, 54 కారణంగా ప్రయివేట్ స్కూల్స్, కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.

పిటిషనర్ తరుపు న్యాయవాది మతుకుమల్లి విజయ్ తన వాదనలు వినిపించారు. వివరాలు తెలిపేందుకు 2 రోజులు గడువు కోరారు రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది. ఇక ఇదే చివరి అవకాశం, ఎల్లుండి తుది విచారణ చేపడతామన్న ధర్మాసనం... తుది విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. కరోనా సమయంలో ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచడంపై ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: