టాలీవుడ్ నటి సమంత ఇప్పుడు ఎక్కడ కనిపించినా ఒక్కటే ప్రశ్న ఎదరవుతుంది. మీరు చైతూ విడిపోతున్నారా..? అంటూ సమంతను అడిగేస్తూ విసిగిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత పోస్టులకు ఎక్కువగా విడాకుల ప్రశ్నలే కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆలయాల సందర్శనలో ఉన్న సమంత ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే అక్కడ కూడా ఓ మీడియా ప్రతినిధి సమంత మీరు నాగచైతన్యతో విడిపోతున్నారంట అని ప్రశ్నించగా సమంత ఒకింత అసహనానికి గురైనట్టు కనిపించింది.
వెంటనే గుడికి వచ్చా బుద్ధి ఉందా అంటూ నోరుమూయించింది. అయితే సమంత అలాంటిది ఏమీ లేదు అవన్నీ పిచ్చి రాతలు అని చెప్పినా ఈ సమస్యకు చెక్ పడేది. లేదంటే అవును విడిపోతున్నాం మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పినా మళ్లీ సమంతకు ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యేవి కావు. కానీ మీడియా ప్రతినిధి నోరుమూయించి మరోసారి సామ్ వార్తల్లో నిలిచింది తప్ప విడాకులపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.