వైసీపీ ఎమ్మెల్యే నుంచి ప్రాణ హాని: మేయర్ సంచలనం
నా ఇంటిచుట్టు కొందరు ఆకతాయిలు చేతులు ఊపుతూ బెదిరిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన మనుషులతో బెదిరిస్తూ నన్ను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. జిల్లా ఎస్పీకి కాకినాడ టీడీపీ మేయర్ పావని లేఖ రాసారు. కాకినాడ నగర ప్రధమ పౌరురాలైనా తనకే ఇలా ఉంటే ఇక్కడ ప్రజలకు భద్రత ఇంకెక్కడిదని ఆవేదన వ్యక్తం చేసారు.