బ్రేకింగ్:చెప్పినంత పని చేస్తున్న పవన్ కళ్యాణ్...?

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా దృష్టి పెట్టారు. అక్టోబర్ 2వ తేదీన రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేస్తారు పవన్ కళ్యాణ్. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసేందుకు రానున్న పవన్ కళ్యాణ్... 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ పైన శ్రమదానం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో కొత్తచెరువు పంచాయతీ పరిధిలో చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేస్తారు ఆయన. రాష్ట్రంలో రహదారుల దుస్థితి ని వివరిస్తూ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా జనసేన ఉద్యమం భారీగా నిర్వహించింది. నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం స్పందించకుంటే ని అక్టోబర్ 2న శ్రమదానం చేస్తామని పవన్ ఒక ప్రకటన కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: