రెవెన్యూ వసూళ్లపై విజిలెన్స్ నివేదిక
కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాల్లో ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి కనిష్టంగా వెయ్యి నుంచి పదివేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం నివేదించింది. వాస్తవానికి ఈ నివేదిక జూన్ 19 న వచ్చింది. కానీ కలెక్టరేట్లలో రహస్యంగా ఉంచినట్టు సమాచారం. మొత్తం 43 మందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిపారసు చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకొని నివేదించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.