కళా'మా' తల్లి: సీసీటీవీ పుటేజ్ రేపు?
మా ఎన్నికల్లో అవక తవకలు జరిగాయని, మోహన్బాబు కొందరు సభ్యులపై రౌడీయిజం చేశారని, దౌర్జన్యానికి దిగారని ప్రకాష్ రాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీఈ ఫుటేజ్ కావాలంటూ ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు లేఖ రాశారు. దీనిపై సీసీ టీవీ ఫుటేజ్లు రేపు అందుతున్నాయని కృష్ణమోహన్ తెలిపారు. తనకు తెలిసి ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని, మా కార్యాలయానికి ఫోన్చేసి అడిగితే సీసీటీవీ ఫుటేజ్ తీసినవారు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. రేపు వస్తుందని చెప్పారు. నాకు తెలిసి అది చాలా భద్రంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. మోహన్బాబుతో తనకు సాన్నహిత్యం ఉన్న మాట వాస్తవమేనని, అయితే సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఎన్నికలను ఒకరికి అనుకూలంగా జరపలేమన్నారు. తాను న్యాయవాదినని, పది ఎన్నికలు జరిపానని, ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టంగా చెప్పగలనన్నారు. తాను కావాలనే ఏదో చేశాననుకోవడం కూడా తప్పుడు ఆలోచన అని కృష్ణమోహన్ అన్నారు.