వంద కోట్ల వాక్సిన్.. భారతావని విజయం పీఎం మోడీ
నిన్న మనం చరిత్ర సృష్టించాం. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ విజయం సాధ్యమైంది. దేశ ప్రజల సహకారంతోనే వందకోట్ల వ్యాక్సిన్ పూర్తి చేశాం. కరోనా వ్యాక్సిన్ వల్ల భారత్ అంటే ఏంటో చూపించాం. ఈ విజయం మన అందరిదీ. వ్యాక్సిన్ వార్ రూమ్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంబరాలు జరుపుకున్నారు. వందకోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చిన భారత సత్తా చాటాం. ఈ వ్యాక్సిన్ తో నవభారత్ కు నాంది పలికింది అని పేర్కొన్నారు.