చంద్రబాబు దీక్ష విరమణ.. రాష్ట్రపతితో అపాయింట్మెంట్..!
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని చంద్రబాబు కోరుతూ.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని విన్నవించారు. ఈ క్రమంలో ఈనెల 25న రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు చంద్రబాబుకు అపాయింట్మెంట్ లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.