తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ మెయిల్.. రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో విత్తనాల షాపుల వారు వరి విత్తనం అమ్మితే సుప్రీకోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నా.. వదిలేది లేదని షాపు సీజ్ చేసి తీరుతానని కలెక్టర్ హెచ్చరించడం ఏంటని ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా ఊరుకోను అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.