టీమిండియా ఓటమిపై సచిన్ ఏమన్నారంటే..?
ఇక పాకిస్తాన్ బౌలర్లు బాగా రాణించారని.. బౌలర్లతో పాటు ఓపెనర్లు రిజ్వానా, బాబర్ ఆజమ్ అద్భుతమైన బ్యాటింగ్తో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారని సచిన్ తెలిపారు. భారత్ మాదిరిగానే పాక్ ప్రారంభంలోనే రెండు, మూడు వికెట్లు పడితే ఒత్తిడిలోకి వెళ్లేదని వెల్లడించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో రెండేళ్ల నుంచి ఎలాంటి మ్యాచ్లు ఆడకపోవడం వల్ల భారత జట్టు వారి ఆటను అర్థం చేసుకోలేకపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక జరుగబోయే మ్యాచ్లలో భారత క్రికెట్ జట్టు తప్పకుండా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు సచిన్ టెండూల్కర్.