సీపీఎస్ రద్దు చేస్తారా...?

నేడు సచివాలయంలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జర్గుతున్న నేపధ్యంలో ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ని 5 వ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు. ఉద్యోగుల సమస్యల చిట్టను కౌన్సిల్ మీటింగ్ ముందు ఉద్యోగ సంఘాలు ఉంచే అవకాశం ఉంది.

నెలనెలా జీతం కోసమూ ఎదురుచూపులు ఇక ముగియాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ నివేదిక చేతిలో ఉన్న 3 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరీక్షణ తెరదించాలి అంటూ విజ్ఞప్తి చ్చేస్తున్నారు. ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో 5,600 కోట్ల బకాయిలు పెరుకున్నాయి. డీఏ బకాయిలు 12,492 కోట్లు కు చేరుకున్నాయి. ఇతర బకాయిలు రూ.3,000 కోట్లు గా ఉద్యోగ సంఘాల అంచనా వేస్తున్నాయి. ఆర్థిక అంశాలపై ఎలాంటి నిర్ణయం ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దారులు ఎదురు చూస్తున్నారు. దీనిపై ప్రత్యామ్నాయ విధానం ప్రతిపాదన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: