చంద్రబాబు కుప్పం పర్యటన పై టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి మండిపడ్డారు. అరాచకాలు చేసే సంప్రదాయం వైసీపీకి లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మా అధికారులకు కూడా లేదంటూ వ్యాఖ్యానించారు. అమరావతి లో ఏవిధంగా బూతులు తిట్టి, దాడులు చేయించుకుని , ఢిల్లీ వరకు రంకెలు వేసారో.. ప్రజలు గమనిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరారు..కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నాడు అంటూ వైవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
జలసీ.... ఈర్శ్య తో చంద్రబాబు ఉన్నారని, ప్రజలు బుద్ధి చెప్పారు, మరలా బుద్ధి చెబుతారు అంటూ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల తో శాశ్వతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండిపోతారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అదే భయంతో చంద్రబాబు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని...ప్రజలు బుద్ధి చెప్పారు..మరల బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.