లోకేష్పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏమన్నాడంటే..?
జనం తమను తరిమేశారన్న ఉక్రోషంతో ఎవర్నీకూడ రోడ్లపై తిరగనివ్వం అని, తరిమికొడతామని లోకేష్ అసభ్య పదజాలంతో వీరంగం సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. గతంలో తానేసిన రోడ్లపై నడుస్తున్నారని ఓటు వేయకపోతే తాట తీస్తానని జనాన్ని చంద్రబాబు బెదిరించినట్టు గుర్తు చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలవని, బెదిరిస్తే ఓట్లు రావు బాబు అని ట్విట్టర్లో వెల్లడించారు విజయసాయిరెడ్డి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నాయకులు తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసుకోవడం సంచలనంగా మారుతోంది.