ప్రజాప్రతినిధుల కేసులు: సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంటుందా...?
ఏడాదిలో కేసు విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని పిటిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలతో సిద్దంగా ఉండాలని గత వారం విచారణ సందర్భంగా... సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి సిజెఐ ధర్మాసం విచారణ చేపడుతున్నారు.