32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు
ముఖ్యంగా కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని, జీహెచ్ఎంసీ నుంచి తమ కార్పొరేషన్లకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. మేయర్ హటావో అనే నినాదాలతో బల్దియా ప్రధాన ఆఫీసులో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లను అతికించారు. అయితే ఇవాళ తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ కార్పొరేటర్లపై, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సీపీని కోరారు. దీంతో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులకు ఫిర్యాదును చేసారు.