పెళ్లింట విషాద ఛాయలు..! నిన్న వరుడు, నేడు వధువు మృతి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగం పల్లి కి చెందిన శ్రీనివాసులుకు, తమిళనాడుకు చెందిన కనిమొళితో పెళ్లి జరిగింది. తిరుపతిలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట చెన్నై వెళ్తుండగా దుర్ఘటన ఎదురైంది. శ్రీనివాసులు తన భార్య కనిమొళితో కలిసి అత్తారింటివెళ్తుండగా కారు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నవ నరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన వధువు కనిమొళిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పెళ్ళైన 24 గంటలు గడవక ముందే శ్రీనివాసులు ప్రాణాలు పోగొట్టుకోగా.. చికిత్స పొందుతూ ఇవాళ వధువు కనిమొళి మృతి చెందింది.