ఇవాళ మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంత్యక్రియలు..
అనంతరం శేషాద్రి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ధర్మారెడ్డి. డాలర్ శేషాద్రి సోదరులు మాట్లాడుతూ.. తమ సోదరుడి మృతి తీరలేనిదని చెప్పారు. ఆయనకు చిన్నప్పటి నుంచి తిరుపతిలోని గోవిందరాజస్వామి అంటే అపారమైన భక్తి అని, ఎప్పుడూ స్వామివారి సేవలోనే గడపాలని చిన్నప్పటి నుంచి కోరుకునేవారని వెల్లడించారు. విద్య పూర్తి చేసుకున్న అనంతరం శేషాద్రికి ఎల్ఐసీలో ఉద్యోగం వచ్చినప్పటికీ శ్రీవారిపై భక్తితో ఎల్ఐసీలో ఉద్యోగం వదులుకుని టీటీడీలో చేరారని చెప్పారు. ఆయన లాంటి క్రమశిక్షణ ఉన్న వ్యక్తులను ఇక టీటీలో చూడలేమని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో శేషాద్రికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు శేషాద్రి కుటుంబ సభ్యులు తెలిపారు.