జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. 120 రైళ్లు రద్దు..!
జవాద్ తుఫాన్ కారణంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసామని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ అధికారులు ప్రకటించారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా మీదుగా శనివారం రాకపోకలు కొనసాగించాల్సిన ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, వీక్లీ, స్పెషల్ ట్రైన్స్, పాసింజర్ రైళ్లను నిలిపి వేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. 18463 భువనేశ్వర్- ప్రశాంతి, రైలు నెంబర్ 18637 హటియా -బెంగళూరు కాంట్, రైలు నెంబర్ 22819 భువనేశ్వర్ -విశాఖపట్నం, రైలు నెంబర్ 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్, 18418 గుణుపూర్- పూరి, 12807 విశాఖపట్నం -నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్, 18551 విశాఖపట్నం- కిరండూల్ సహా పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసినది.