ప్రధాని మోడీ రోశయ్యకు సంతాపం
రోశయ్యకు నాకు చాలా అనుబంధం ఉంది. రోశయ్య సేవలు మరువలేనివి. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తనతో ఎన్నో విషయాలను చర్చించారు అని గుర్తు చేశారు. గొప్ప వ్యక్తి.. మంచి మనస్పూర్తి కలిగిన వ్యక్తి రోశయ్య అని పేర్కొన్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా వ్యక్తి గతంగా మాత్రం మంచి మనుసు ఉన్న వ్యక్తి అని మోడీ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పలువురు ప్రశంసిస్తున్నారు. తొలుత జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తారని మీడియాకు ప్రకటించినా.. ఆ తరువాత సీఎంతో చర్చించిన కుటుంబ సభ్యులు కొంపల్లిలోని రోశయ్య ఫాంహౌస్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు కుటుంబ సభ్యులు.