కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం..!
ఇప్పటివరకు దాదాపు 46 మంది విద్యార్థులకు కరోనా వచ్చినట్టు నిర్థారణ అయింది. ఉదయం నుంచే కోవిడ్ పరీక్షలు చేపడుతూనే ఉన్నారు వైద్యులు. కరోనా సోకిన నేపథ్యంలో ఇప్పటికే యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించినది. వారం రోజుల కిందటే కళాశాలలో స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. అయితే నిన్న నిర్వహించిన పరీక్షలలో 18 మందికి నిర్థారణ కాగా.. ఈరోజు నిర్వహించిన పరీక్షలలో 28 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే కొంతమంది విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలు లేని విద్యార్థులకు కూడా కోవిడ్ పరీక్షలు చేపడుతున్నారు. ప్రస్తుతం కొద్ది రోజుల పాటు ఈ కళాశాలకు సెలవు ప్రకటించారు. ఎన్ని రోజుల అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.