తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు వాలంటీర్లను ఎంపీడీఓ విజయ తొలగించారు. ఈ విషయంపై రెచ్చిపోయిన వైసీపీ నేత, నల్లల చెరువు మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీ అసభ్యంగా చీరేస్తా అంటూ ఎంపీడీఓకు వార్నింగ్ ఇచ్చాడు.
దీనిపై పలువురు టీడీపీ అభిమానులు నేతలు వైసీపీ నేతల బలుపుకు ఇది నిదర్శనం అని.. మహిళల పట్ల వీళ్లు ఏవిధంగా మాట్లాడుతున్నారో ఇదే నిదర్శనం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీళ్ల కుటుంబాలలో మహిళలు ఎవరూ ఉండరేమో అనిపిస్తుందని.. ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వీళ్లను ఊసి అసహించుకుంటూంటారేమో అని పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్రెడ్డి తన పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేసేది ఇలాగేమోనని పేర్కొన్నారు.
మరోవైపు తూర్పుగోదావరి అయినవిల్లి మండలం ఎంపీడీఓ కట్టుపల్లి రాజ విజయను బెదిరించిన వైసీపీ నేతలపై తాజాగా కేసు నమోదు చేసారు పోలీసులు. ముఖ్యంగా అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్రావు, ఎన్. పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంకరాయగూడం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, జగన్నాథపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసారు పోలీసులు.