నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 3 గంటలకు తిరుచి విమానశ్రయానికి పయనమై.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు. ఐటీసీ గ్రాండ్ చోళలో బస చేసి.. ఆ తరువాత చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ను కలువనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో రేపు పలు అంశాలపై చర్చించనున్నా తెలంగాణ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్టాలిన్ పలు అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా కేంద్రం రాష్ట్రాలపై అనుసరిస్తున్న వైఖరి, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తమిళనాడు, తెలంగాణ రెండు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.