ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని సంబురపడుతున్న సమయంలోనే ఒమిక్రాన్ మళ్లీ ప్రజల మీదకు విరుచుకుపడుతున్నది. ఈ వేరియంట్ భయంతో ఉన్న ప్రజలకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడడం భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న విషయం విధితమే.
రెండు రోజుల కిందటే యాక్షన్ కింగ్ అర్జున్కూడా కరోనా పడ్డారు. తాజాగా స్టార్ హీరో విక్రమ్ కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. ఇవాళ కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇది ఒమిక్రాన్ వేరియంట్ అవునా ..? కాదా..? అని నిర్ధారించడానికి పరీక్ష రిపోర్టులను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ వైద్యుల పర్యవేక్షణలో తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో తనతో పాటు తిరిగిన వారందరినీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు విక్రమ్. ఈ విషయం తెలిసిన వెంటనే విక్రమ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసారు.