కుటుంబంతో‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్”పుష్ప ది రైజ్” చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైనది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ టాక్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో సందడి చేయనున్నది. అల్లు అర్జున్ మలయాళ అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. అక్కడ తమిళ వెర్షన్ లో అయితే విడుదల చేసారు. కానీ మలయాళ వెర్షన్ ను సాంకేతిక సమస్య కారణంగా రేపు విడుదల చేయనున్నారు. ఇక ఆంధ్రాలోనూ చాలాచోట్ల బెనిఫిట్ షోలు నడవలేదు. ఏపీ ప్రభుత్వం అఖండతో పాటు ఈ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతించలేదు. అన్నిచోట్లా పుష్ప సినిమాకు మంచి డిమాండ్ ఉన్నది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 95-100% టికెట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో 5 షోలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉదయం ఇప్పటికే సినిమా థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈరోజు ‘పుష్ప’రాజ్ సందడి చేయబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రైజ్”ను ఫ్యామిలీతో కలిసి వీక్షించనున్నారు. బన్నీ అభిమానులు మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో సినిమాను చూడబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా మేనేజర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పోటెత్తడం ఖాయమని తెలుస్తోంది. ఇక ‘పుష్ప’ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి మరీ.