షాకింగ్: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కారు మెమోలు..?

Chakravarthi Kalyan
పీఆర్సీ జోవోలు అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. జీవోలు  వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసినప్పటికీ ప్రభుత్వం  తగ్గడం లేదు. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ఖజానా ఉద్యోగులను మళ్లీ ఆదేశించింది. ప్రాసెస్ చేయని వారికి మెమోలు జారీ చేసింది. జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించే సహించేది లేదని హెచ్చిరించింది.


జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు ఏపీ సర్కారు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సంబంధిత విభాగాధిపతులకు ప్రభుత్వం నేరుగా ఆర్డర్లు పాస్ చేసింది.  విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసింది.  కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపు ఏర్పాట్లు చేయాల్సిందిగా మరోసారి అధికారులకు తేల్చి చెప్పింది. ఇందుకు సిబ్బంది సహకరించకపోతే ఇతర ఏర్పాట్లు చేయాలని కోరింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఈ మేరకు ఆర్డర్లు పాస్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: