వైసీపీకి మరో షాక్.. ఆ జడ్పీ ఛైర్పర్సన్కు నోటీసులు..?
ఎందుకంటే.. క్రిస్టీనాకు నలుగురు సంతానం ఉన్నారని సరళ కుమారి పిటిషన్ దాఖలు చేసింది. క్రిస్టినా కుల ధృవీకరణపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలోనే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని సరళ కుమారి అంటోంది. తాజాగా తెనాలి కోర్టు లో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని క్రిస్టీనా ఎన్నిక చెల్లుబాటు కాదని పిటిషన్ లో సరళ కుమారి పేర్కొన్నారు. దీంతో జెడ్పీ ఛైర్ పర్సన్ క్రిస్టీనా కు తెనాలి కోర్టు నోటీసులు జారీ చేసింది.