వండర్ : పోయిన 24 ఏళ్లకు దొరికిన బంగారం..?
ఈ ఘటనలో 24 ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన బంగారం తిరిగి మళ్లీ యజమాని ఇంటికి చేరింది. కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు అసలు యజమానికి అప్పగించారు. అసలేం జరిగిందంటే.. ముంబయి కొలాబా ప్రాంతంలోని అర్జన్ దాస్వానీ ఇంట్లో 1998లో దొంగతనం జరిగింది. ఆ ఘటనలో రెండు పురాతన బంగారు నాణేలు, 3 బంగారు కంకణాలు, రెండు కడ్డీలను దుండగులు మాయం అయ్యాయి. అర్జన్ కుటుంబం అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ తమ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటూ ఏళ్లుగా క్రమం తప్పకుండా పోలీసులను అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సొమ్మును పోలీసులు అసలు యజమానికి అప్పగించారట.