బ్రేకింగ్: ఫార్మా కంపెనీలపై ఎన్జీటీ సీరియస్.. ఎందుకంటే..?
ఫార్మా కంపెనీలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బాగా సీరియస్ అయింది. ఈ మేరకు కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయశాఖ కమిషనర్, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. గురువారం జస్టిస్ కే.రామకృష్ణ, ఎక్స్ పర్ట్ మెంబర్ కే.సత్యగోపాత్తో కూడిన చైన్నై ఎన్జీటీ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంపై నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణకు చెందిన గుమ్మి నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ మేరకు పలు ఫార్మా కంపెనీలల్లో వెలువడుతున్న కాలుష్యంపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని నరేందర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. రోజు రోజుకు ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్నారు. తద్వారా రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఈ మేరకు కాలుష్య కారక సంస్థలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి ఎన్జీటీ న్యాయస్థానం వాయిదా వేసింది.