ఆ 5 రాష్ట్రాలకు ఇవాళ కేంద్రం పిలుపు.. కీలక భేటీ?
ఢిల్లీలోని జలశక్తిశాఖ కార్యదర్శి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో గోదావరి-కావేరి అనుసంధాన అవకాశాలను గుర్తించి చర్చిస్తారు. ఈ ప్రాజెక్టు ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరుపుతారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్రం సంబంధిత ఐదు రాష్ట్రాల జలవనరులశాఖ కార్యదర్శులను ఆహ్వానించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కార్యదర్శులను కేంద్రం ఆహ్వానించింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జలవనరులశాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తారు.