కేంద్ర మంత్రికే వార్నింగ్ ఇచ్చిన శివసేన..?
ఇటీవల కేంద్ర మంత్రి రాణే.. ఉద్ధవ్ ఠాక్రే కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు ఈడీ నోటీసులు పంపించబోతోదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై శివసేన కూడా ఘాటుగానే స్పందించింది. సంజయ్ రౌత్ దీనికి దీటుగా బదులిచ్చారు. రాణే కేంద్రమంత్రి అయితే కావచ్చు.. కానీ ఇది మహారాష్ట్ర.. ఆ విషయం మరిచిపోకండి. మీరే అంటే మేం మీకు బాప్.. అంటే ఏంటో తెలుసగా.. మా జాతకాలు మీ దగ్గర ఉందని మీరు అనుకోవచ్చు.. కానీ.. మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ విషయం మరిచిపోవద్దు... అంటూ సంజయ్ రౌత్ ఏకంగా కేంద్ర మంత్రికే వార్నింగ్ ఇచ్చారు.