బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. ఇవాళే తీర్పు?
ఈ విషయంలో అసెంబ్లీ కార్యదర్శికి రెండ్రోజుల క్రితం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు పిటిషనర్లు, హైకోర్టు రిజిస్ట్రీ ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. నోటీసులు ఇచ్చే ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిపిన పిటిషనర్లు, రిజిస్ట్రీ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే.. హైకోర్టు ఎలాంటి చర్య తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా చట్టసభలు, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారి నిర్ణయాలపై కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోవు. మరి ఈ విషయంలో హైకోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.