దారుణం: తహశీల్దార్ ఆఫీసులోనే వీఆర్ఏను చంపేశారు
రక్తపు మడుగులో ఉన్న దుర్గంబాబును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి శవాన్ని పరిశీలించి.. విచారణ ప్రారంభించారు. భూవివాదాలు ఏమైనా ఈ హత్యకు దారి తీశాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. వీఆర్ఏలు గ్రామాల్లో కీలకమైన విధుల్లో ఉంటారు. గ్రామాల్లోని రెవెన్యూ వ్యవహారాలను వీఆర్ఏకు, తహశీల్దార్కు అందిస్తుంటారు. ఇలాంటి కీలకమైన విధుల్లో ఉన్నందున.. ఏదైనా భూ వ్యవహారమో.. ఇసుక మాఫియా వ్యవహారమో హత్యకు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రామస్తులు మాత్రం దుర్గంబాబు వివాదాల జోలికి పోడని చెబుతున్నారు. అసలు విషయం విచారణలో తేలాల్సిందే.