ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ నగరంలో రష్యా అరాచకం?

Chakravarthi Kalyan

ఉక్రెయిన్‌ దేశానికి చెందిన అనేక నగరాలను రష్యా సేనలు ముట్టడి చేస్తున్నాయి. క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. జనావాసాలపైనా దాడులు చేస్తున్నాయి. ప్రత్యేకించి రష్యా దాడుల్లో మరియపోల్ అనే నగరం పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఈ నగరం దాదాపు నేలమట్టం అయినట్టు తెలుస్తోంది. రష్యా కొన్ని రోజులుగా ఈ మరియపోల్‌ నగరంపైనే దృష్టి సారించి ధ్వంసం చేస్తోంది. వ్యూహాత్మక ప్రాంతంలో ఈ నగరంలో ఉండటంతో దీనిపై రష్యా కన్నేసింది. రష్యా తీరుతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ప్రత్యేకించి మరియు పోల్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని బ్రిటన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దాడులు ఇలాగే కొనసాగితే మరియు పోల్‌ నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని బ్రిటన్ హెచ్చరించింది. అయితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా.. తాము నేరుగా యుద్ధానికి దిగే అంశంపై మాత్రం ఈయూ దేశాలు వెనుకాడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: